గ్రూప్ 4 అప్లికేషన్ల గడువు ఈనెల 3వ తేదీతో ముగియనుంది. అంటే అప్లికేషన్ల నమోదుకు ఇంకా ఒక్కరోజు గడువు మిగిలింది. శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు అభ్యర్థులు ఆన్లైన్లో తమ అప్లికేషన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పోస్టుల రిక్రూట్మెంట్ కావటంతో పోటీ పడే అభ్యర్థుల సంఖ్య అంతకంతకు పెరిగిపోయింది. గురువారం నాటికే గ్రూప్ 4 అప్లికేషన్ల సంఖ్య తొమ్మిది లక్షలు దాటిపోయింది. మొత్తం 9,08. 061 అప్లికేషన్లు నమోదయ్యాయి.
గ్రూప్ 4లో పెరిగిన పోస్టులు
టీఎస్పీఎస్సీ ముందుగా ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం గ్రూప్ 4 పోస్టుల సంఖ్య 8039గా మాత్రమే ఉంది. ఇటీవల మరో 141 ఖాళీలను పెంచుతూ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ ల్లో 141 జూనియర్ అసిస్టెంట్స్ ఖాళీలను గ్రూప్-4 లో చేర్చుతున్నట్లు ప్రకటించింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 8,180కు చేరింది.
WHATS GROUP LO ADD THE NUM
9182082813
Raviteja