మహాత్మ జ్యోతిబాఫూలె బీసీ రెసిడెన్షియల్ కాలేజీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్
మహాత్మ జ్యోతి బా ఫూలే బీసీ రెసిడెన్షియల్ కాలేజీల్లో 2020–21 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ లో చేరేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులందరూ ఈ ఎంట్రన్స్ రాసేందుకు అర్హులు. ఈ పరీక్షలకు అప్లై చేసే గడువును జులై 12 వరకు పొడిగించింది. ఈ పరీక్షలో మెరిట్ సాధిస్తే.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 19 జూనియర్ కాలేజీల్లో (7 బాలికల కాలేజీలు, 12 బాలుర కాలేజీలు) ఇంటర్ అడ్మిషన్ పొందవచ్చు.
ఫ్రీ.. అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్;
ఈ కాలేజీల్లో ప్రభుత్వమే నాణ్యమైన విద్యను అందించటంతో పాటు విద్యార్థులకు ఉచిత భోజన. వసతి సదుపాయాలు కల్పిస్తోంది.
ఎంసెట్ జేఈఈ కోచింగ్; ప్రత్యేకంగా ఎంసెట్, జేఈఈ శిక్షణను అందిస్తోంది.
కోర్సులు; ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ .
దరఖాస్తులకు చివరి తేదీ; జులై 12 (ఫీజు రూ.200)
అడ్మిషన్లు; ఎంట్రన్స్లో మెరిట్ ఆధారంగా (ఇంకా పరీక్ష తేదీని ప్రకటించలేదు)
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు కింది లింక్ ను క్లిక్ చేయండి.
అప్లై చేసేందుకు వెబ్సైట్; https://mjpabcwreis.cgg.gov.in
కాలేజీలు ఎక్కడెక్కడ
–––––––––––––
బాలికలు; నాగర్ కర్నూల్, కల్వకుర్తి(నాగర్ కర్నూల్), సంగారెడ్డి,
జగదేవ్ పూర్(సిద్ధిపేట), ఆదిలాబాద్, ఎల్ఎండి కాలనీ(కరీంనగర్), లంకపల్లి(ఖమ్మం)
బాలురు: చిట్యాల(వనపర్తి) కొండగల్(వికారాబాద్), మహేశ్వరం(రంగారెడ్డి), దౌలతాబాద్(సిద్ధిపేట)
కౌడిపల్లి(మెదక్), ధర్మారం(నిజామాబాద్) లక్సెటి పేట(మంచిర్యాల), కమలాపూర్(వరంగల్.-అర్బన్),
శాయంపేట(వరంగల్-రూరల్), బోనకల్ (ఖమ్మం), నాగార్జున సాగర్, మూసీ ప్రాజెక్టు (నల్గొండ)
ఎంట్రన్స్ ఎలా ఉంటుంది;
మల్టిపుల్ ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఎంట్రన్స్ ఉంటుంది. టైమ్ రెండున్నర గంటలు. మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. విద్యార్థి ఆసక్తిని బట్టి ఎంచుకున్న గ్రూప్ ను బట్టి వేర్వేరు ప్రశ్నపత్రాలుంటాయి. ప్రశ్నలన్నీ టెన్త్ సిలబస్ లోబడి ఉంటాయి.