తెలంగాణ ఐసెట్ షెడ్యూల్ ఖరారైంది. ఎంబీఏ,ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల కు నిర్వహించే టీఎస్ఐసెట్–2021 నోటిఫికేషన్ ఏప్రిల్ 3న రిలీజవుతుంది. ఆగస్టులో మూడు సెషన్లలో ఐసెట్ను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఐసెట్ ఎంట్రన్స్లో కేవలం 25శాతం మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టేననీ, ఎస్సీ,ఎస్టీలు ఎగ్జామ్ రాస్తే సరిపోతుందని ప్రకటించింది.
ఏప్రిల్ 7 వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు.
జనరల్ స్టూడెంట్స్కు రూ.650 ఫీజుండగా, ఎస్సీ,ఎస్టీ,వికలాంగులకు రూ.450 నిర్ణయించారు. జూన్15 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చు.
రూ.250 ఫైన్తో జూన్ 30 వరకు అప్లై చేయవచ్చు.
రూ.500ఫైన్తో జులై 15 వరకు, రూ.వెయ్యి ఫైన్తో జులై 30 దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంది.
ఏప్రిల్ 3న ఐసెట్ నోటిఫికేషన్: ఎస్సీ ఎస్టీలకు లక్కీ ఛాన్స్
Advertisement