జులైలో జరగాల్సిన టీఎస్ఎంసెట్ ఎగ్జామ్స్ఆగస్టు 4 లేదా 5 నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి కొత్త షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి రెడీ చేసింది. కరోనా తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో జూన్, జులై నెలల్లో జరిగే టీఎస్ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, పీఈసెట్ ఎంట్రెన్స్ లు వాయిదాపడ్డాయి. ఈ పరీక్షలను నిర్వహించే తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఇతర పోటీ పరీక్షలకు ఇబ్బంది కాకుండా కొత్త డేట్లు ఫిక్స్ చేసింది.. వీటిని రెండు రోజుల కింద ప్రభుత్వానికి పంపింది.
జులై 1న జరగాల్సిన టీఎస్ఈసెట్ను ఆగస్టు 3న ,
జులై 5 నుంచి 9 వరకు జరగాల్సిన ఎంసెట్ను ఆగస్టు 5వ తేదీ నుంచి 9 వరకు నిర్వహించాలని ప్రతిపాదనలు రెడీ చేశారు.
జూన్ 19 నుంచి 22 వరకు జరగాల్సిన పీజీఈసెట్ ఎగ్జామ్ను ఆగస్టు మూడోవారంలో .
జూన్ 7 నుంచి జరగాల్సిన పీఈసెట్ ఫిజికల్ టెస్టులనూ ఆగస్టులోనే ప్రారంభించాలని యోచిస్తున్నారు.
రెండు, మూడు రోజుల్లో రివైజ్డ్ షెడ్యూల్ను అధికారికంగా ప్రకటిస్తారు.