ఇంటర్ ఫెయిలైన విద్యార్థులను పాస్ చేస్తూ తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా ఈ ఏడాది ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసింది. అందుకే ఇంటర్ సెకండియర్ ఫెయిలైన విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చి కంపార్ట్మెంట్ పాస్గా ప్రకటించింది. రిజల్ట్ ప్రాసెస్ పూర్తయిందని ఇంటర్ బోర్డు ప్రకటించింది.
రాష్ట్రంలో 1,50,941 మంది ఫెయిలైన విద్యార్థులను గ్రేస్ మార్కుల ద్వారా పాస్ చేసింది. ఇందులో సెకండియర్ జనరల్, వొకేషనల్ విద్యార్థులున్నారు.
వీళ్లకు సంబంధించి ఫస్టియర్ లో ఫెయిలైన సబ్జెక్టులు (బ్యాక్ లాగ్స్) మిగిలి ఉన్నా సరే…అవన్నీ పాస్ అయినట్లుగా డిక్లేర్ చేసింది. ప్రతి సబ్జెక్టులో 35 శాతం కనీస పాస్ మార్కులు కేటాయించింది.
విద్యార్థులకు సంబంధించిన మార్కుల వివరాలతోపాటు సవరించిన మార్కుల మెమోలను ఈరోజు (జులై 31) మధ్యాహ్నం 2 గంటల నుంచి బోర్డు వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
మార్కులు తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి
2nd Year Intermediate General
2nd Year Intermediate Vocational
ఇంటర్ ఫెయిలైనోళ్లందరూ పాస్: మార్కుల మెమోలకు క్లిక్ చేయండి
Advertisement