ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ ను ఈ ఏడాది. కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. తెలంగాణా లోని అన్ని యూనివర్సిటీల పరిధిలో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎం బీ ఏ)/మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(ఎం సీ ఏ) కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్దేశించిన తెలంగాణా స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీ ఎస్ ఐ సెట్)-2021 నోటిఫికేషన్ విడుదల అయింది.
ఆసక్తి, అర్హత కల అభ్యర్థులు తమ దరఖాస్తులని ఆన్ లైన్ లో ఏప్రిల్ 7 వ తేదీ నుంచి దాఖలు చేసుకోవచ్చు.
పరీక్ష: ఆగస్ట్ 19,20 తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాలలోని 14 సెంటర్ ల లో జరగనుంది
కోర్సులు: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ర్టేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (ఎంసీఏ)
అర్హత; డిగ్రీ ఉత్తీర్ణత
వెబ్సైట్; https://icet.tsche.ac.in/TSICET/TSICET_HomePage.aspx
