తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో అడ్మిషన్లకు నిర్వహించే టీఎస్ ఐసెట్ (TS ICET 2023) ఎంట్రన్స్ నోటిఫికేషన్ రిలీజైంది. మే 26, 27 తేదీల్లో రెండు సెషన్లలో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. మార్చి 6వ తేదీ నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. మే 6వ తేదీ వరకు అప్లికేషన్లకు తుది గడువు నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్లైన్లో తమ అప్లికేషన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ పూర్తి అయిన వారు, ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు అర్హులవుతారు.
అప్లికేషన్ తో పాటు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.550, మిగతా వాళ్లకు రూ.750 ఫీజు చెల్లించాలి. రూ.250 ఫైన్ తో మే 12, రూ.500 ఫైన్ తో మే 18 వరకు తుది గడువుగా నిర్ణయించారు. జూన్ 20న ఐసెట్ ఫలితాలను వెల్లడిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 సెంటర్లలో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి, కేయు వీసీ తాటికొండ రమేష్, రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, కన్వీనర్ పి.వరలక్ష్మి ఐసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈసారి పరీక్షను కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది.