తెలంగాణ ఎంసెట్కు ఈసారి సిలబస్ ను తగ్గించారు. ఇంటర్ లో 70 శాతం సిలబస్ నుంచే ఎంట్రన్స్ నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ఎంసెట్ ర్యాంకులకు ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఉంటుందని ప్రకటించింది. జూన్ 14 తర్వాత ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రేపటికల్లా ఎంసెట్ పూర్తి సిలబస్ను విడుదల చేయనుంది. ఎంసెట్తో పాటు ఈసారి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు 70 శాతం సిలబస్ను ఖరారు చేసింది. ఫస్ట్ ఇయర్ సిలబస్ లో మార్పులేమీ ఉండబోవని.. వంద శాతం సిలబస్ ఉంటుందని ప్రకటించింది.
ఎంసెట్-2021 నిర్వహణ పై విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి, ఇతరులు దీనికి హాజరయ్యారు.సిలబస్ తగ్గింపు,వెయిటేజ్ తదితర అంశాల గురించి సమావేశంలో చర్చించారు.
ఎంసెట్ సిలబస్ 70 శాతమే: ఇంటర్ మార్కుల వెయిటేజ్ యథాతథం
Advertisement