సెప్టెంబర్ 2న పాలీసెట్
హైకోర్టు అనుమతితో ఎంట్రన్స్లను నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఆగస్టు 31న ఈసెట్. సెప్టెంబర్ 2న పాలిసెట్. సెప్టెంబర్ 9, 10, 11, 14వ తేదీలలో ఎంసెట్ నిర్వహించాలని కొత్త షెడ్యూలు ఫిక్స్ చేసింది. ఈ నెల 14న డిగ్రీ పీజీ పరీక్షల పై సుప్రీం కోర్టులో హియరింగ్ ఉంది. 17 నాడు తెలంగాణ హైకోర్టు లో సెట్స్ పై కేసు విచారణ జరగనుంది. అదే రోజున హైకోర్టు అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు అనుమతిస్తే.. కొత్త షెడ్యూలు ప్రకారం సెట్స్ జరగనున్నట్లు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రకటించింది..
Advertisement