ఎంసెట్లో (TS EAMCET 2023) ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించి నట్లు సమాచారం. ఈ మేరకు త్వరలో జీవో విడుదల కానుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాదికి ఇంటర్ మార్కులకు ఎంసెట్ లో వెయిటేజీ ఉండదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TSCHE) ప్రకటించినా.. ఈ నిర్ణయాన్ని శాశ్వతంగా అమలు చేయాలని సర్కార్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గతంలో ఎంసెట్ లో అభ్యర్థులు సాధించిన మార్కులకు 75 శాతం వెయిటేజీ.. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ తో ఎంసెట్ ర్యాంకులను నిర్ణయించేవారు.
అయితే.. కరోనా కారణంగా 2020, 2021, 2022లో ఇంటర్ మార్కులకు వెయిటేజీని తొలిగించింది ప్రభుత్వం. అయితే.. ఇదే నిర్ణయాన్ని భవిష్యత్ లోనూ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎంసెట్ కు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఆర్టీయూకేటీ, ఓపెన్ స్కూల్ తదితర బోర్డుల విద్యార్థులు హాజరవుతున్నారు. ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉంటే.. వారి బోర్డు ఫలితాల విడుదల ఆలస్యమైతే ఎంసెట్ ఫలితాల విడుదల కూడా లేట్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్ మార్కులకు వెయిటేజీని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.