పరీక్షలు నిర్వహించకుండా డిగ్రీలు ప్రధానం చెయ్యడం కుదరదు.. అని సుప్రీం కోర్టు తేల్చిచెప్పటంతో.. రాష్ట్రంలో డిగ్రీ పరీక్షల షెడ్యూలు త్వరలోనే విడుదల కానుంది. సెప్టెంబర్ 30లోగా పరీక్షలు నిర్వహించాలన్న యూజీసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ విద్యార్థులు సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు. పరీక్షలు నిర్వహించకుండా డిగ్రీలు ఇవ్వలేమని యూజీసీ వాదించింది. కరోనా విపత్తు కారణంగా నెలకొన్న పరిస్థితులతో పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థుల తరపు న్యాయవాదులు వాదించారు. వాదనలు విన్న అపెక్స్ కోర్ట్ ఈరోజే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అని, తేల్చి చెప్పింది. దీంతో యూజీసీ డిగ్రీ పరీక్షల నిర్వహణ పై దృష్టి సారించనుంది. సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్రంలో ఇప్పటికే వాయిదా పడ్డ డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించటం తప్పనిసరిగా మారింది. అందుకే వచ్చే నెలలో డిగ్రీ పరీక్షల నిర్వహించే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ 16 నుంచి డిగ్రీ పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే జేఎన్టీయూతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ షెడ్యూలు రెడీ చేసుకుంది. సుప్రీం కోర్టు తీర్పు వెలువడటంతో రేపోమాపో అధికారికంగా ఎగ్జామ్ షెడ్యూలును ప్రకటించే అవకాశాలున్నాయి.