HomeLATESTపదో తరగతి మార్కులు గ్రేడ్‌లు.. జీపీఏ

పదో తరగతి మార్కులు గ్రేడ్‌లు.. జీపీఏ

అందరూ పాసయ్యారు. మరి గ్రేడ్లు.. జీపీఏ ఎలా లెక్కిస్తారని టెన్త్ విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పదో తరగతి లో నాలుగు సార్లు నిర్వహించిన ఫార్మేటివ్​ అసెస్మెంట్​ (ఎఫ్​ ఏ) మార్కుల ఆధారంగానే గ్రేడ్​లు, జీపీఏ లు కేటాయిస్తారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.
ప్రతి సబ్జెక్టు లో 20 మార్కులకు ఎప్​ఏలు జరిగాయి. ఈ 20 మార్కుల్లో విద్యార్థులకు ఎంత శాతం మార్కులు వచ్చాయో వాటి పర్సంటేజీ ప్రకారం జీపీఏలను కేటాయిస్తారు. నాలుగు ఎఫ్​ఏలను యావరేజ్​ చేసి మొత్తం 100 మార్కులుగా పరిగణిస్తారు. ఉదాహరణకు ఒక విద్యార్థికి సైన్స్‌లో ఇంటర్నల్‌ మార్కులు 20కి 20 వచ్చి ఉంటే అతనికి వందకి 100 మార్కులు వచ్చినట్లు లెక్క. అప్పుడు ఆ విద్యార్థికి ఆ సబ్జెక్టులో ఏ–1 గ్రేడ్‌ (10 జీపీఏ ) వస్తుంది. అలాగే మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో కూడా ఏ–1 గ్రేడ్‌ వస్తే.. 10/10 జీపీఏ వస్తుంది.

Advertisement

ఒకవేళ ఇంటర్నల్స్‌లో ఒక్కో సబ్జెక్టులో 18 మార్కులే వస్తే అతనికి మొత్తం 90 మార్కులు వచ్చినట్లు పరగిణిస్తారు. దీని ప్రకారం ఆ సబ్జెక్టులో ఏ–2 గ్రేడ్ ఇస్తారు. ఆ విద్యార్థికి 9 పాయింట్‌ జీపీఏ వస్తుంది.

అన్ని సబ్జెక్టుల్లో ఏ 1 గ్రేడ్​ వచ్చి.. ఏ ఒక్క సబ్జెక్ట్​లో ఏ2 గ్రేడ్​ వచ్చినా.. ఆ విద్యార్థికి జీపీఏ 9.8 పాయింట్​ అవుతుంది.

మిగిలిన సబ్జెక్టుల్లో కూడా వచ్చే జీపీఏ లను బట్టి యావరేజ్‌ మార్కుల పర్సంటేజీ ఆధారంగా గ్రేడ్లు, జీపీఏలను కేటాయిస్తారు.

టెన్త్​ క్లాస్​ గ్రేడింగ్​ సిస్టమ్​

గ్రేడ్​అసెస్మెంట్​ మార్కులు (యావరేజ్​)గ్రేడ్​ పాయింట్లు
A1 91-10010
A2 81-909
B1 71-808
B2 61-707
C1 51-606
C2 41-505

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!