దేశంలో ఈ ఏడాది టాప్ టెన్ డిగ్రీ కాలేజీలను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఎంపిక చేసింది. హెచ్ఆర్డీ విభాగానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ప్రతి ఏడాది కాలేజీల విభాగంలో ర్యాంకుల వారీగా టాప్ కాలేజీలను గుర్తించి ప్రకటిస్తుంది.
2021 సంవత్సరపు ర్యాంకుల్లో ఢిల్లీలోని మిరిండా హౌస్ కాలేజీ టాప్ వన్లో నిలిచింది. ఏటేటా డిగ్రీ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. సివిల్ సర్వీసెస్ టార్గెట్ చేసిన విద్యార్థులందరూ డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ప్రతి ఏడాది దేశంలో 1.80 కోట్ల మంది విద్యార్థులు బీఏ, బీఎస్సీ, బీకాం డిగ్రీలు చదువుతున్నారు.
అందుకే దేశంలో ఎక్కడెక్కడ టాప్ కాలేజీలున్నాయో.. ఒక లుక్కుస్తే బెటర్.
టాప్-10 డిగ్రీ కాలేజీలు
TOP 10 DEGREE COLLEGES
1. మిరిండా హౌస్, ఢిల్లీ
2. లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, న్యూఢిల్లీ
3. లయోలా కాలేజ్, చెన్నై
4. సెయింట్ జేవియర్స్ కాలేజ్, కోల్కతా
5. రామకృష్ణ మిషన్ విద్యామందిరం, హౌరా
6. పీఎస్జీఆర్ క్రిష్ణమ్మాళ్ కాలేజ్ ఫర్ ఉమెన్, కోయంబత్తూర్
7. ప్రెసిడెన్సీ కాలేజ్, చెన్నై
8. సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, ఢిల్లీ
9. హిందూ కాలేజ్, ఢిల్లీ
10. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, ఢిల్లీ
మన తెలుగు రాష్ట్రాల్లో విజయవాడకు చెందిన ఆంధ్ర లయోలా కాలేజ్ 34వ ర్యాంకు దక్కించుకుంది. హైదరాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ 85వ ర్యాంకు దక్కించుకున్నాయి. రాజమండ్రి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, హైదరాబాద్లోని లయోలా అకాడమీ, నిజాం కాలేజ్ టాప్ 200 లిస్టులో ఉన్నాయి.