టీజీపీఎస్సీ ఆఫీసులో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ సొసైటీలు, కార్పొరేషన్లు, జాతీయ బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులు డిప్యుటేషన్పై పని చేసేందుకు ఈ ప్రకటన జారీ చేసింది. చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్తో పాటు చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్ నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్, జూనియర్ నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ ప్రోగ్రామర్, జానియర్ ప్రోగ్రామర్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత రంగాల్లో బీటెక్, ఎంటెక్ అర్హతలున్న ఉద్యోగులు ఈ పోస్టులకు అర్హులవుతారు. హైదరాబాద్లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసులో అయిదేండ్ల పాటు డిప్యుటేషన్ పై ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు అర్హులైన ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని టీజీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. పే స్కేల్ వివరాలను కూడా ప్రకటించింది. అప్లికేషన్ ఫామ్ను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.

For job