తెలంగాణలో గ్రూప్-2 పేపర్-1, పేపర్ -2 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. 783 గ్రూప్-2 సర్వీసుల పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ డిసెంబర్ 15, 16న పరీక్షలు నిర్వహిస్తోంది. తొలి రోజున రాష్ట్రవ్యాప్తంగా 1,368 కేంద్రాల్లో జరిగిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గ్రూప్ 2కు 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కోపేపర్కు 150 మార్కుల చొప్పున మొత్తం నాలుగు పేపర్లకు పరీక్ష జరుగుతోంది.