గ్రూప్ 1 ప్రిలిమ్స్ (TGPSC GROUP 1 PRELIMINARY) పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జూన్ 9వ తేదీన జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు 74 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు గ్రూప్ 1కు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3.02 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపర్ గతంలో జరిగిన రెండు పేపర్లో పోలిస్తే బెటర్గా ఉందని సబ్జెక్టు నిపుణులు విశ్లేషించారు. ఈ పరీక్ష పత్రంతో పాటు వివిధ కోచింగ్ సెంటర్లు. సబ్జెక్టు నిపుణులు తయారు చేసిన కీ ఇక్కడ అందుబాటులో ఉంది. ఇది అభ్యర్థులు ఎన్ని మార్కులు వస్తాయో అంచనా వేసుకునేందుకు మాత్రమే ఉపయోగించుకోవాలి. టీజీపీఎస్సీ విడుదల చేసిన కీని మాత్రమే ఫైనల్గా గుర్తించాలి.