HomeLATESTమార్చిలోనే గ్రూప్​ 1, 2, 3 ఫలితాలు

మార్చిలోనే గ్రూప్​ 1, 2, 3 ఫలితాలు

గ్రూప్‌-1, 2, 3 పరీక్షల ఫలితాలను మార్చిలో విడుదల చేసేందుకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TGPSC) సిద్ధమైంది. మార్చి మొదటి వారంలో గ్రూప్‌-1 మెయిన్స్‌ జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను ప్రకటించి.. ఆ తర్వాత గ్రూప్‌-2, ఆపైన గ్రూప్‌-3 ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఒకే అభ్యర్థి రెండు మూడు పోస్టులకు ఎంపికైతే.. ఖాళీలు మిగలకుండా ఉండేందుకు ముందుగా గ్రూప్​ 1 నియామక ప్రక్రియ, తర్వాత గ్రూప్​ 2, తర్వాత గ్రూప్​ 3 ఫలితాలు విడుదలవుతాయి. మొత్తం 5,51,247 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు పోటీపడ్డారు. మొత్తం 2741 పోస్టులు ఈ ఫలితాలతో భర్తీ అవుతాయి.

గ్రూప్​ 1 లో 563 ఉద్యోగాలకు జూన్‌ 9న పరీక్ష జరిగింది. 3.02 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్​ హాజరవగా, మెయిన్స్‌కు 31,382 మంది అర్హత సాధించారు. వీరిలో 21,093 మంది మెయిన్స్​లో అన్ని పరీక్షలు రాశారు. మెయిన్స్‌ జీఆర్ఎల్​ను ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​ ముగిసిన వెంటనే విడుదల చేయాలని టీజీపీఎస్​సీ భావిస్తోంది.

గ్రూప్​ 2 మొత్తం 783 పోస్టులున్నాయి. గత ఏడాది డిసెంబరు 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. 2,57,981మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ లెక్కన గ్రూప్‌-2లో మొత్తం 783 పోస్టుల్లో ఒక్కోదానికి 329 మంది పోటీ పడుతున్నారు.

గ్రూప్‌-3 పరీక్షలు గత ఏడాది నవంబరులో జరిగాయి. మొత్తం 2,72,173 మంది ఈ పరీక్షలు రాశారు. మొత్తం 1,388 పోస్టులున్నాయి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!