సీబీఎస్ఈ తరహాలోనే తెలంగాణలోనూ టెన్త్ పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు రాత్రికి ఉత్తర్వులు వెలువడనున్నాయి. కరోనా కేసులు పెరగడంతో రాష్ట్ర విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో గురువారం రివ్యూ నిర్వహించారు. సెకండ్ వేవ్ తీవ్రత, పేరెంట్స్ ఆందోళన దృష్ట్యా టెన్త్ పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనుంది. ఇంటర్ కు సంబంధించి ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ప్రమోట్ చేయాలని, సెకండియర్ ఎగ్జామ్స్ను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులను ఈనెల 30వరకు పొడగించింది. ఇంటర్ సెకండియర్ పరీక్షలను జూన్ లో నిర్వహించే అవకాశాలున్నాయి.