పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం 2020-21 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వచ్చే నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్లో, ఆఫ్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. టీవీ, జర్నలిజం, జ్యోతిషంలో పీజీ డిప్లొమాతో పాటు లైట్ మ్యూజిక్, ఫిలిమ్ లైటింగ్, జ్యోతిషంలో డిప్లొమా కొర్సులు, సంగీత విశారద, మోడ్రన్ తెలుగు, జ్యోతిష్యంలో సర్టిఫికెట్ కోర్సులు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు: రూ.300
దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 31, 2020
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 30, 2020
వెబ్సైట్:http://www.teluguuniversity.ac.in/
పీజీ డిప్లొమా కోర్సులు: టీవీ జర్నలిజం, జ్యోతిషం
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
డిప్లొమా కోర్సులు: లైట్ మ్యూజిక్, ఫిలిమ్ రైటింగ్, జ్యోతిషం
అర్హత: పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఫిలిమ్ రైటింగ్ కోర్సుకు తెలుగులో రాయడం, చదవడం వచ్చి ఉండాలి.
సర్టిఫికెట్ కోర్సులు: జ్యోతిషం, సంగీత విశారద, మోడ్రన్ తెలుగు
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంగీత విశారద కోర్సుకు 12 ఏళ్లు నిండిన వారై ఉండాలి.