తెలంగాణ స్త్రీ నిధి సంస్థ.. 123 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉండి, 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములయ్యే ఈ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల వారు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మహిళా సాధికారత దిశగా పని చేసే ఈ ప్రభుత్వ అనుబంధ సంస్థలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు ఇది ఒక గొప్ప అవకాశం.
నోటిఫికేషన్కు సంబంధించి మరిన్ని వివరాలు:
ఖాళీల సంఖ్య: 123 (అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు)
విద్యార్హతలు:
1.అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
2.కంప్యూటర్ పరిజ్ఞానం (MS Office) కలిగి ఉండటం అదనపు అర్హతగా పరిగణించబడుతుంది.
3.స్థానిక భాష (తెలుగు)పై పట్టు ఉండటం తప్పనిసరి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయస్సు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. అంతే కాకుండా గరిష్టంగా 35 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
ఎంపిక విధానం:
అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల ఎంపిక ప్రక్రియ సాధారణంగా రెండు దశల్లో ఉంటుంది.
రాత పరీక్ష: అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ: రాత పరీక్షలో మెరిట్ సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు.
అప్లికేష్లకు చివరి తేదీ:
మే 29 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ విధానం:
1.ముందుగా స్త్రీ నిధి అధికారిక వెబ్సైట్ https://www.streenidhi.telangana.gov.in లోకి లాగిన్ అవ్వాలి.
2.హోమ్ పేజీలో ఉన్న ‘Recruitment 2026’ లింక్పై క్లిక్ చేయాలి.
3.అవసరమైన వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, అప్లికేషన్ ఫారమ్ను నింపాలి.
- ఫోటో, సంతకంతో పాటు అవసరం అయిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
5. తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్ను సబ్మిట్ చేసి..ప్రింట్ తీసుకోవాలి.





