2022–-23.. అంటే వచ్చే విద్యా సంవత్సరానికి తెలంగాణా లోని సాంఘిక,గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ ప్రవేశాలకి నోటిఫికేషన్ విడుదల అయింది. బీఏ, బీకాం. బీఎస్సీ, బీబీఏ కోర్సుల్లో ప్రవేశాలుంటాయి. ప్రవేశ పరీక్ష 2022 జనవరి 23 వ తేదీన జరుగనుంది.
Advertisement
ఇంటర్మీడియెట్ లో 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు ఈ ప్రవేశ పరీక్ష రాయటానికి అర్హులు. ఆసక్తి, అర్హతలున్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 10 వ తేదీ నుంచి వచ్చే జనవరి 10 వ తేదీ వరకు అప్లికేషన్లు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది.
Advertisement