తెలంగాణ గ్రూప్ 1 (Telangana Group 1) ఫలితాలు విడుదలయ్యాయి. 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలను టీజీపీఎస్సీ (TGPSC) సోమవారం మధ్యాహ్నం వెల్లడించింది. టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అభ్యర్థులు తమ టీజీపీఎస్సీ ఐడీ, మెయిన్స్ హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీతో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి పేపర్ల వారీగా తమ మార్కులు తెలుసుకునే వీలుంది.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు 2023 అక్టోబర్ 21 నుండి 27 వరకు నిర్వహించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 7 పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షల వాల్యుయేషన్ పూర్తిచేసిన అధికారులు, మార్కుల వివరాలను అభ్యర్థుల లాగిన్లలో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ మార్కులను మార్చి 16 సాయంత్రం 5గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టీజీపీఎస్సీ సూచనల ప్రకారం, అభ్యర్థులు తమ మెయిన్స్లో సాధించిన మార్కుల షీట్లను డౌన్లోడ్ చేసుకొని రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది.

గ్రూప్ 1 అభ్యర్థులు తమ మార్కుల రీకౌంటింగ్కు టీజీపీఎస్సీ అవకాశం కల్పించింది. అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్సైట్లో మార్చి 10 నుండి 24 తేదీ సాయంత్రం 5గంటల వరకు ఒక్కో పేపర్కు రూ.1000 చొప్పున చెల్లించి మార్కుల రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్కు కేవలం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థుల మొత్తం మార్కులను టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచుతారు.
తుది జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసి, దాని ఆధారంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిలుస్తారు. నోటిఫికేషన్లో సూచించినట్లుగా అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇతర అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది.
మార్కుల షీట్ల డౌన్లోడ్ లేదా రీకౌంటింగ్ దరఖాస్తుకు సంబంధించి ఏవైనా సాంకేతికపరమైన సమస్యలు ఎదురైతే, అభ్యర్థులు టీఎస్పీఎస్సీ హెల్ప్డెస్క్ నంబర్లైన 040-23542185 లేదా 040-23542187లలో సంప్రదించవచ్చు. అలాగే, helpdesk@tspsc.gov.in ఈమెయిల్ ద్వారా కూడా సంబంధిత సమస్యలను నివేదించవచ్చు.