ఎంసెట్, నీట్, ఐ ఐ టి కు సిద్దమవుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా షార్ట్ టైం ఆన్లైన్ కోచింగ్ అందిస్తోంది. ఈ అవకాశాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో పాటు ప్రయివేటు కళాశాలలో చదువుకున్న విద్యార్థులు వినియోగించుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి కోరారు. శుక్రవారం నుంచి ఈ ఆన్లైన్ కోచింగ్ ను ప్రారంభించారు. సబ్జెక్టు నిపుణులైన లెక్చరర్లు ఈ ఆన్ లైన్ కోచింగ్ అందిస్తున్నారు. ఇవి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి ప్రకటించారు. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ఈ కోచింగ్ ఉంటుందని, తక్కువ టైమ్లో ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందన్నారు. గత ఏడాది కూడా ఎంసెట్, నీట్, ఐ ఐ టి కి సిద్దమైన విద్యార్థులకు ఆన్లైన్ కోచింగ్ ఇవ్వగా రాష్ట్రంలోని, ఇతర రాష్ట్రాలకు చెందిన 20 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2685 మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు.
ఆన్లైన్ కోచింగ్ లింక్ http://tscie.rankr.io
ఎంసెట్, నీట్, ఐఐటీ షార్ట్ టర్మ్ ఆన్లైన్ కోచింగ్: ఉచితంగా అందిస్తున్న తెలంగాణ గవర్నమెంట్
Advertisement