వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా మరో 2,391 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తన ట్వీట్టర్ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేశారు. బీసీ గురుకులాల్లో మొత్తం 1,499 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రిన్సిపాల్ పోస్టులు 10, డిగ్రీ లెక్చరర్స్ 480, జూనియర్ లెక్చరర్స్ 185, పీజీటీ 235, టీజీటీ 324 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ ఖాళీలను టీఎస్పీఎస్సీ, మెడికల్ హెల్త్ బోర్డు, మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డుల ద్వారా భర్తీ చేయనున్నారు. ఇంకా.. సమాచార పౌర సంబంధాల శాఖలో 166 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి త్వరలో ప్రకటనలు విడుదలయ్యే అవకాశం ఉంది.