HomeLATESTతెలంగాణలో రేషన్ డీలర్ జాబ్స్.. టెన్త్ పాసైతే చాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

తెలంగాణలో రేషన్ డీలర్ జాబ్స్.. టెన్త్ పాసైతే చాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

రేషన్ డీలర్.. ఉన్న ఊరిలోనే చేసే ఉద్యోగం. నెలకు కొన్ని రోజులు మాత్రమే పని ఉండే కొలువు. దీంతో రేషన్ డీలర్ కావాలని అనేక మంది నిరుద్యోగ యువత భావిస్తూ ఉంటారు. అలాంటి వారికి శుభవార్త. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో పలు రేషన్ డీలర్ ఖాళీల (Ration Dealer Jobs) భర్తీకి అధికారులు నోటిఫికేషన్ (Ration Dealer Notification) విడుదల చేశారు. మొత్తం 27 చౌకధరల దుకాణాలకు సంబంధించి డీలర్ల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రేషన్ డీలర్ అనగానే.. నామినేటెడ్ విధానంలో ఎంపిక ఉంటుందని అంతా భావిస్తూ ఉంటారు. అయితే.. రేషన్ డీలర్ల ఎంపికకు సైతం రాత పరీక్ష ఉంటుంది. అనంతరం ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేపడుతారు.

Advertisement

విద్యార్హతలు:
అభ్యర్థులు తప్పనిసరిగా టెన్త్ పాసై ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఒక వేళ అభ్యర్థులు పదికి మించి విద్యార్హత కలిగి ఉన్నా కూడా వారి టెన్త్ అర్హతను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అభ్యర్థి సంబంధిత గ్రామ పంచాయతీ పరిధిలో నివాసం ఉంటూ ఉండాలి. వయస్సు 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులకు వయోపరిమితి విషయంలో సడలింపు ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అయితే.. అభ్యర్థులపై ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండరాదని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

దరఖాస్తు:
అభ్యర్థులు రూ.1000 చెల్లించి దరఖాస్తు పత్రములను రాజస్వ మండలాధికారి గారి కార్యాలయం, ఆదిలాబాద్ చిరునామాలో దరఖాస్తులను పొందవలసి ఉంటుంది. ఆ దరఖాస్తులను పూర్తిగా నింపి జనవరి 6 వ తేదీలోపు ఆదిలాబాద్‌ ఆర్‌డీవో కార్యాలయంలో అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో డేట్ ఆఫ్ బర్త్, విద్యార్హతలు, కులం, చిరునామా, స్థానికత కు సంబంధించి తగిన ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

రాత పరీక్ష:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 22న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (పురుషులు), ఆదిలాబాద్ చిరునామాలో రాత పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 27న రాజస్వ మండలాధికారి కార్యాలయం ఆదిలాబాద్ చిరునమాలో ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్వ్యూ 20 మార్కులకు కలిపి మొత్తం 100 మార్కులకు నియామక ప్రక్రియ ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!