HomeLATESTటీచర్​ పోస్టుల భర్తీ ఎప్పుడు.. పూర్తి వివరాలు..

టీచర్​ పోస్టుల భర్తీ ఎప్పుడు.. పూర్తి వివరాలు..

తెలంగాణలో అయిదేళ్లుగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తారని లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులను జిల్లాలకు సర్దుబాటు చేసే ప్రక్రియ ముగిసింది. ఖాళీ పోస్టుల విషయంలో ఒక స్పష్టత కూడా వచ్చింది. దీంతో ప్రభుత్వం ఇకనైనా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)పై, టీచర్‌ పోస్టుల భర్తీపై స్పష్టత ఇవ్వాలనే డిమాండ్లు అంతటా వినిపిస్తున్నాయి.

Advertisement

గత ఐదేళ్లుగా టీచర్‌ పోస్టుల భర్తీ చేపట్టకపోవడంతో ఉపాధ్యాయ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్‌ నోటిఫికేషన్‌, ప్రతి రెండేళ్లకో సారి డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసేవారు. తెలంగాణ ఏర్పడ్డాక పరిస్థితి మారిపోయింది. ఒకే ఒక్కసారి 2017లో టీచర్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ జారీ చేశారు. అప్పటివరకు ఉన్న డీఎస్సీ పేరును టీఆర్‌టీగా మార్చి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఈ నియమకాలు చేపట్టారు. అప్పట్లో మొత్తం 25వేల టీచర్‌ పోస్టుల ఖాళీలు ఉంటే ప్రభుత్వం 13,500 పోస్టులకు మాత్రమే ఆమోదం తెలిపింది. చివరికి 8792 ఖాళీల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్‌ జారీ చేశారు. దశల వారీగా వీటిని భర్తీ చేస్తున్నారు. ఆ తరువాత మళ్లీ నోటిఫికేషన్‌ రాలేదు. రాష్ట్రంలో ప్రతి ఏటా 12,500 మంది డీఎడ్‌ కోర్సును, మరో 15 వేల మంది బీఎడ్‌ కోర్సును పూర్తి చేస్తున్నారు.

ప్రస్తుతం మొత్తం 1.75 లక్షల మంది డీఎడ్‌, 3 లక్షల మందికి పైగా బీఎడ్‌ పూర్తిచేసిన వారు ఉన్నట్లు అంచనా. టెట్‌లో అర్హత సాధించినవారు పేపర్‌-1లో 65 వేల మంది, పేపర్‌-2లో 1.5 లక్షల మంది ఉన్నారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం గత ఐదేళ్లుగా టెట్‌ నిర్వహించడం లేదు. తొలి టెట్‌ను 2016 మే 22న, రెండో టెట్‌ను 2017 జూలై 23న నిర్వహించారు. ఆ తరువాత మళ్లీ టెట్‌ ఊసే లేకపోవడంతో డీఎడ్‌, బీఎడ్‌ పూర్తి చేసినవారికి అన్యాయం జరుగుతోంది. ప్రస్తుతం టెట్‌కు జీవితకాలపరిమితి ఇచ్చినా.. నూతన అభ్యర్థులతోపాటు, గతంలో టెట్‌లో అర్హత సాధించనివారు లక్షల్లో ఉన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యా బోధన చేయాలన్నా టెట్‌ అర్హత తప్పనిసరి కావడంతో అభ్యర్థులంతా టెట్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

తెలంగాణ ఏర్పడ్డాక దాదాపు 5 లక్షల మంది బీఎడ్‌, డీఎడ్‌ పూర్తి చేసిన అభ్యర్థులున్నారు. వీరందరూ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మాత్రం టీఆర్‌టీపై రెండేళ్లుగా ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూనే ఉంది. ఇటీవలి టీచర్ల బదిలీలతో అన్ని అవరోధాలు తొలిగిపోయాయి. బదిలీల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 వేల మంది ఉపాధ్యాయులు కొత్త జిల్లాలకు వెళ్లనున్నారు. మిగిలినవారు ఇప్పటివరకు పనిచేసిన స్థానాల్లో కొనసాగనున్నారు. అంటే.. గతంలో ఉన్న ఖాళీలు అలాగే ఉండిపోనున్నాయి. కొత్తగా ఉపాధ్యాయులను కేటాయించిన జిల్లాల్లో కొన్ని ఖాళీలు తగ్గిపోనుండగా, ఏ జిల్లాల నుంచి టీచర్లను కేటాయించారో.. అక్కడ కొత్త ఖాళీలు ఏర్పడ్డాయి.

Advertisement

ప్రస్తుతం ఒక జిల్లాలో ఉద్యోగం చేస్తూ మరో జిల్లాకు బదిలీ అయిన వారిలో ఎక్కువ మంది 2017 టీఆర్‌టీ, 2012 డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందినవారే ఉన్నారు. తాజాగా ఏర్పడ్డ ఖాళీలను కొత్త టీఆర్‌టీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. కొత్త రిక్రూట్మెంట్ చేపడితే మారిన నిబంధనల ప్రకారం 95 శాతం లోకల్ జిల్లా కోటాలో స్థానిక అభ్యర్థులకు ఎక్కువ పోస్టులు దక్కుతాయి. మిగతా 5 శాతం నాన్‌ లోకల్‌ కోటాలో భర్తీ చేస్తారు. 2017 టీఆర్‌టీ ద్వారా సింగిల్‌ టీచర్‌గా భర్తీ అయిన చాలా పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను ప్రస్తుతం వేరే జిల్లాలకు కేటాయించారు. ఈ ఖాళీలను వెంటనే భర్తీ చేయాల్సి ఉంది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!