సాఫ్ట్వేర్ సంస్థల్లో ఆఫ్ క్యాంపస్ కొలువుల జాతర మొదలైంది. 2019, 2020, 2021లో డిగ్రీలు పూర్తిచేసుకున్న వారితోపాటు 2022లో చదువు పూర్తిచేసుకోబోతున్నవారికీ అవకాశం కల్పిస్తున్నాయి. ఫ్రెషర్స్గా జాబ్ సంపాదించి ఐటీలో స్థిరపడేందుకు టాప్ ఐటీ కంపెనీలు మంచి ప్యాకేజీతో ఆఫర్స్ ఇస్తున్నాయి. టీసీఎస్, మైక్రోసాఫ్ట్ తో పాటు యాక్సెంచర్ లాంటి ప్రముఖ కంపెనీలు డిగ్రీ పూర్తయిన అభ్యర్థులను ఆహ్వానిస్తున్నాయి.
వెల్ కమ్ టు టీసీఎస్
బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ కోర్సులు 2019/2020/2021లో పూర్తి చేసుకొని, ఐటీలో కనీసం ఆరు నెలల అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం టీసీఎస్ ఎదురు చూస్తోంది. ఆఫ్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్ ప్రకటన విడుదల చేసింది. పరీక్షలో ప్రతిభ చూపి ఎంపికైతే రూ.7 లక్షల నుంచి 7.3 లక్షల వార్షిక వేతనం అందుకోవచ్చు. ఇందుకోసం ముందుగా నేషనల్ క్వాలిఫయర్ టెస్టు (ఎన్క్యూటీ)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అందులో చూపిన ప్రతిభతో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగంలోకి తీసుకుంటారు.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్
ఆసక్తి ఉన్న విద్యార్థులు ముందుగా టీసీఎస్ నెక్స్స్టెప్ పోర్టల్లోకి వెళ్లాలి. అందులో రిజిస్టర్ నౌ క్లిక్ చేసి ఐటీ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ వివరాలు నమోదు చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ సార్లు పేరు నమోదు చేసుకుంటే అనర్హులుగా పరిగణిస్తారు. పరీక్ష రిమోట్ విధానంలో ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు టీసీఎస్ అయాన్ ద్వారా తెలుపుతారు.
ఎగ్జామ్ ప్యాటర్న్
టీసీఎస్ అయాన్ ద్వారా దీన్ని నిర్వహిస్తారు. ఎగ్జామ్ డ్యురేషన్110 నిమిషాలు. ఇందులో అడ్వాన్స్డ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40, వెర్బల్ ఎబిలిటీ 10, అడ్వాన్స్డ్ కోడింగ్ 60 నిమిషాల వ్యవధితో ఉంటాయి. టీసీఎస్ రెజొనెన్స్ ద్వారా పరీక్షకు సన్నద్ధత కావచ్చు. ఇందులో డిజిటల్ టెస్ట్ ప్రిపరేషన్ సిరీస్లు ఉంటాయి. వాటిని బాగా సాధన చేస్తే పరీక్షలో విజయం సాధించడానికి వీలవుతుంది. టెస్టు షెడ్యూల్ వివరాలు ఈమెయిల్కు అందుతాయి. అలాగే పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆ వివరాలూ ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు. ఇంటర్వ్యూ సమయానికి అన్ని సర్టిఫికెట్లూ అందుబాటులో ఉండాలి.
అర్హతలు ఇవే..
టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ (చదివినట్లైతేనే)లో 70 శాతం మార్కులు తప్పనిసరి. ఆయా కోర్సులను కేటాయించిన వ్యవధిలోనే పూర్తిచేసుకున్నవారై ఉండాలి. బ్యాక్లాగ్స్ ఉండకూడదు. విద్యా సంవత్సరాల్లో రెండేళ్ల కంటే ఎక్కువ వ్యవధి ఖాళీగా ఉండరాదు. ఫుల్ టైమ్ కోర్సులు చదివినవారే అర్హులు. పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ ద్వారా చదువుకున్నా పర్వాలేదు. కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఐటీలో పని అనుభవం తప్పనిసరి. వయసు 28 ఏళ్లకు మించరాదు. ఇంజినీరింగ్లో యూజీ లేదా పీజీ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంఎస్, ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్, ఇంటిగ్రేటెడ్ బీటెక్-ఎంటెక్ వీటిలో ఏదైనా కోర్సు పూర్తిచేసుకున్నవారై ఉండాలి.
చివరితేదీ: 25 ఫిబ్రవరి.
వెబ్సైట్: https://www.tcs.com/careers/tcs-digital-hiring
మైక్రోసాఫ్ట్ లో మంచి ఛాన్స్
ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ విధానంలో 2022లో కోర్సులు పూర్తిచేసుకుంటున్నవారికి అవకాశం కల్పిస్తోంది. కోడింగ్లో నైపుణ్యం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారు ప్రయత్నించవచ్చు.
అర్హత: 7.5 సీజీపీఏతో బీటెక్/ఎంటెక్/ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ ఉత్తీర్ణత. 2022 బ్యాచ్ విద్యార్థులు మాత్రమే అర్హులు. సెలెక్ట్ అయిన అభ్యర్థులు బెంగళూరు, హైదరాబాద్, నోయిడాలో పని చేయాల్సి ఉంటుంది.
వెబ్సైట్: https://careers.microsoft.com/us/en
ఐబీఎం, డెల్, ఇంటెల్…తదితర సంస్థలు ఇటీవల కాలంలో బీటెక్ పూర్తిచేసుకున్న, 2022లో పూర్తిచేసుకోబోతున్న విద్యార్థుల కోసం అవకాశాలు అందిస్తున్నాయి. ఆసక్తి ఉన్నవారు ఆయా సంస్థల వెబ్సైట్లలో వివరాలు నమోదు చేసుకోవచ్చు.
యాక్సెంచర్ లో డిగ్రీ, బీటెక్స్ స్టూడెంట్స్కు అవకాశం
ఆధునిక సాంకేతిక కేంద్రాల్లో పనిచేయడానికి నైపుణ్యం ఉన్న మానవ వనరులను యాక్సెంచర్ ఆహ్వానిస్తోంది. ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్నవారికి అప్లికేషన్ డెవలప్మెంట్ అసోసియేట్గానూ, బీఏ, బీకాం, బీవోక్, బీఎస్సీ, బీసీఏ చదువుకున్నవారికి సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్గానూ అవకాశం కల్పిస్తోంది.
అప్లికేషన్ డెవలప్మెంట్ అసోసియేట్: 2019, 2020, 2021లో బీఈ/బీటెక్ కోర్సులు పూర్తి చేసుకున్న అన్ని బ్రాంచీల విద్యార్థులూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదే విభాగంలో పీజీ వాళ్లకోసం ప్రత్యేకంగా నియామకాలు చేపడుతున్నారు. ఎంఈ/ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ (సీఎస్సీ/ఐటీ) కోర్సులు 2019/ 2020/ 2021లో పూర్తిచేసుకున్నవారు వీటికి అర్హులు.
సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్: తక్కువ స్థాయిలో కోడింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ల్లో వీరికి అవకాశం కల్పిస్తారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీవోక్ కోర్సులను ఫుల్ టైమ్ విధానంలో చదువుకున్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదే విభాగంలో పీజీ వాళ్లకోసం ప్రత్యేకంగా నియామకాలు చేపడుతున్నారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంసీఎం, ఎంఎఫ్ఎ కోర్సులు 2019/ 2020/ 2021లో పూర్తిచేసుకున్నవారు అర్హులు.
దివ్యాంగులకు: ఈ సంస్థ దివ్యాంగుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ విభాగాల్లో గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. 2019, 2020, 2021లో కోర్సులు పూర్తిచేసుకున్నవారితోపాటు 2022లో పూర్తి చేసుకోబోతున్నవారికీ ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తున్నారు.
వెబ్సైట్: https://www.accenture.com/in-en