తెలంగాణలోని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 24వ తేదీకి స్కూళ్లకు లాస్ట్ వర్కింగ్ డేగా పరిగణిస్తారు. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు మొత్తం 48 రోజులు పాటు విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. జూన్ 12న తిరిగి స్కూళ్లు రీఓపెన్ అవుతాయి. అకడమిక్ ఇయర్ క్యాలెండర్కు అనుగుణంగా రాష్ట్ర విద్యాశాఖ వేసవి సెలవుల తేదీలను ఖరారు చేసింది.
ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి. అందుకు అనుగుణంగా ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు జరిగే సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా, దాన్ని మార్చుతూ ఏప్రిల్ 12 నుంచి ప్రారంభిచాలని జీవో జారీ చేసింది. ఎండలు పెరిగిపోవడంతో మార్చి 15 నుంచి తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి.