భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్స్ మంత్రిత్వశాఖ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ విభాగానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) మల్టీటాస్కింగ్ (నాన్ టెక్నికల్), హవల్దార్ (సీబీఐసీ అండ్ సీబీఎన్) స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఏప్రిల్ 4వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
పోస్టులు: 1) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ – టెక్నికల్): ఖాళీల వివరాలు త్వరలో వెల్లడిస్తారు.
2) హవల్దార్ (సీబీఐసీ అండ్ సీబీఎన్): 3603
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ (పదో తరగతి) పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. వయసు వివిధ విభాగాలను అనుసరించి 1 జనవరి 2022 నాటికి 18-నుంచి 25 ఏళ్లు, 18 నుంచి -27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎగ్జామ్లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 ఆబ్జెక్టివ్ టైప్, పేపర్-2 డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుంది. పేపర్-1 పరీక్షా పద్ధతి కింది విధంగా ఉంటుంది. నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. జనరల్ ఇంగ్లిష్, జనరల్ ఇంటలీజెన్స్, ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అనే నాలుగు విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు ఇస్తారు. పరీక్షా సమయం 90 నిమిషాలు ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉటుంది.
పేపర్-2: ఇది డిస్క్రిప్టివ్ పద్ధతిలో 50 మార్కులకు ఉంటుంది. షార్ట్ ఎస్సే/ లెటర్ ఇన్ ఇంగ్లిష్ రాయాల్సి ఉంటుంది. పరీక్షా సమయం 45 నిమిషాలు కేటాయిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్: ఆన్లైన్ ద్వారా ఏప్రిల్ 30వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి మే 2వ తేదీ వరకు సమయం ఉంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (టైర్-1) పరీక్ష జులైలో నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం www.ssc.nic.in