నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త చెప్పింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2023-24 సంవత్సారినికి గానూ.. ‘కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2023’ (సీహెచ్ఎస్ఎల్) నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లలో ఖాళీగా ఉన్న 1600 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ (గ్రేడ్-ఎ) విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 8ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
విద్యార్హతల వివరాలు:
ఇంటర్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్ స్కూల్ ద్వారా చదివిన వారికి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్లో సైన్స్ గ్రూప్తో తప్పనిసరిగా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. దరఖాస్తుదారుల వయస్సు ఆగస్టు 1 నాటికి 18-27 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. వివిధ వర్గాల వారికి నోటిఫికేషన్లో సడలింపు ఇచ్చారు. అభ్యర్థులు ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్: https://ssc.nic.in/
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్ధులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంపికైన అభ్యర్థులకు రూ.19,900-రూ.92,300ల వరకు వేతనం చెల్లించనున్నారు.