రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను జులై 1 నుంచి తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణ విధానాలకు అనుగుణంగా ఏయే క్లాసులు ఏయే తేదీల నుంచి ప్రారంభించాలి.. అని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈరోజు విద్యా శాఖ అధికారులతో సమీక్ష జరిపారు.
ఇప్పటికే తీసుకున్న నిర్ణయం ప్రకారం 8,9,10 తరగతులు జులై 1 నుంచి ప్రారంభిస్తారు. ఉదయం 9.30 నుంచి 3.30 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తారు. టీచర్లందరూ ఈనెల 25వ తేదీన స్కూళ్లలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
6, 7 తరగతులను జులై 20 నుంచి ప్రారంభిస్తారు. 3 & 4 & 5 తరగతులకు ఆగస్టు 16 నుంచి స్కూళ్లలో క్లాసులను ప్రారంభిస్తారు.
నర్సరీ ఒకటీ రెండో తరగతి విద్యార్థులకు ఈ ఏడాది స్కూళ్లలో క్లాసులుండవు.