దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తన ఖాతాదారులకు కీలక ప్రకటన చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి ఓ ముఖ్యమైన రూల్ మారనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు జూన్ 30వ తేదీలోగా లాకర్ అగ్రిమెంట్ను సవరించుకొని సంతకం చేయాలని బ్యాంకు తెలిపింది.ఈ మేరకు అధికారిక ఖాతా నుంచి ట్వీట్ చేసింది. లాకర్ రూల్స్ మారబోతున్నట్లు గత కొద్ది రోజులుగా ఖాతాదారులకు సమాచారమిస్తున్నామని బ్యాంక్ తెలిపింది. ఖాతాదారులు వీలైనంత త్వరగా అగ్రిమెంట్పై సంతకం చేయాలని సూచించింది.
ఇప్పటికే సంతకం చేసిన వారు కూడా సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేయాల్సి ఉంటుందని బ్యాంక్ వెల్లడించింది. జనవరి 23న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన జారీ చేసింది. సవరించిన లాకర్ రూల్స్పై కస్టమర్లకు సమాచారం ఇవ్వాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. జూన్ 30లోగా 50 శాతం, సెప్టెంబర్ 30లోగా 75 శాతం కస్టమర్లను సవరించిన లాకర్ అగ్రిమెంట్పై సంతకం చేయించాలని తెలిపింది. సవరించిన రూల్స్ ప్రకారం.. దోపిడి, దొంగతనం, బ్యాంక్/సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా లాకర్లోని సొమ్ము పోతే బ్యాంకులు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.