నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB).. గ్రూప్ డి పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 22 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టెన్త్ లేదా ఐటీఐ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తి కలిగి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా rrbchennai.gov.in అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన వివరాలు:
సంస్థ పేరు: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB)
పోస్ట్ పేరు: గ్రూప్-D (ట్రాక్ మెయింటెనర్, అసిస్టెంట్ పాయింట్స్ మన్, ఇతర పోస్టులు)
మొత్తం పోస్టులు: 22,000
ఖాళీల వివరాలు (పోస్టుల వారీగా):
ట్రాక్ మెయింటెనర్ (గ్రేడ్ IV)-11,000
పాయింట్స్ మన్ B- 5,000
అసిస్టెంట్ (S & T)-1,500
అసిస్టెంట్ (C & W)-1,000
అసిస్టెంట్ (P-way)-300
మిగిలిన పోస్టులు (Bridge, Machine, Electrical, etc.)-3,200
అర్హతలు:
విద్యార్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ లేదా ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు(01-01-2026 నాటికి): అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 33 సంవత్సరాలు ఉండాలి. (ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోప రిమితిలో సడలింపు ఉంటుంది)
జీతం: ఎంపికైన వారికి నెలకు రూ. 18,000 జీతం ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభం: జనవరి 20 నుంచి అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.
చివరి తేదీ: ఫిబ్రవరి 20 వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ విధానం:
1.అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి.
2.ముందుగా RRB అధికారిక వెబ్సైట్ rrbchennai.gov.in లోకి లాగిన్ అవ్వండి.
‘3.CEN 09/2025’ నోటిఫికేషన్ లింక్పై క్లిక్ చేయండి.
4.తర్వాత మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోండి.
5.అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి.
6. ఫీజు చెల్లించి, అప్లికేషన్ సబ్మిట్ చేయండి.





