పోటీ పరీక్షలకు రైలు రవాణా.. ముఖ్యమైన బిట్స్
- ప్రపంచంలో మొదటి రైల్ ఇంజన్ను ఇంగ్లాండ్కు చెందిన స్టీవెన్సన్ (1825) కనుగొన్నాడు. ఇతన్ని ప్రపంచ రైల్వే పితామహుడు అని పిలుస్తారు.
- మొదటి రైలు 1825 సెప్టెంబరు 27న ఇంగ్లాండ్లోని ‘స్టాక్ టన్- డార్లింగ్ టన్’ మధ్య
ప్రారంభమైంది. ఇది ప్రపంచంలో తొలి ట్రెయిన్ సర్వీసు.
- భారత్లో మొట్టమొదటి గూడ్స్ రైలు 1851 డిసెంబరు 22న రూర్కీలో ప్రారంభమైంది.
- మొదటి ప్రయాణికుల రైలు లార్డ్ డల్హౌసీ కాలంలో 1853 ఏప్రిల్ 18న బొంబాయి(భోరి భందర్)- థానె మధ్య థాల్దాట్ గుండా నడిచింది. ఈ రైల్వే లైన్ పొడవు 34 కిమీ.
- 1854 ఆగస్ట్ 15న రెండో రైలు హౌరా -హుగ్లీ మధ్య 24 మైళ్ల దూరం నడిపారు. ఇది తూర్పు భారతదేశంలో మొదటి రైలు నర్వీస్
- దక్షిణ భారతదేశంలో 1856లో మొదటి రైలు సర్వీసు వ్యాసర్బడి జీవ నిలయం నుంచి వల్లజా రోడ్ (ఆర్కాట్) మధ్య ప్రారంభమైంది. దీని దూరం 64 మైళ్లు
- ఉత్తర భారతదేశంలో మొదటి రైల్వే సర్వీసు 1859లో అలహాబాద్ నుంచి కాన్చూర్ వరకు ప్రారంభమైంది. దీని పొడవు 119 మైళ్లు.
- ఆంధ్రప్రదేశ్లో మొదటి రైలు 1862లో పుత్తూరు నుంచి రేణిగుంట మధ్య ప్రారంభమైంది.
- తెలంగాణలో మొదటి రైలు 1874లో సికింద్రాబాద్ – వాడి మధ్య(115.75 మైళ్లు) ప్రారంభమైంది.
- 1929లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైలును నడిపారు. దీని పేరు దక్కన్ క్వీన్. కళ్యాణ్ నుంచి పుణె వరకు దీన్ని నడిపారు.
- దేశంలో మొదటి రైల్వే జోన్ – దక్షిణ రైల్వే జోన్
- అతి చిన్న రైల్వే జోన్. మెట్రో రైల్వే జోన్(కోల్కతా) లేదా తూర్పు కోస్తా
రైల్వే జోన(భువనేశ్వర్)
- మొదటి రైల్వే స్టేషన్ను ప్రారంభించిన జోన్- సెంట్రల్ రైల్వే జోన్(ముంబాయి)
- మూడు రైల్వే జోన్లకు ప్రధాన కార్యాలయంగా ఉన్న నగరం – కోల్కతా (తూర్చు రైల్వే, ఆగ్నేయ రైల్వే, కోల్కతా మెట్రో రైల్వే)
- దేశంలో మొత్తం రైల్వే స్టేషన్ల సంఖ్య 7308
- మొదటి రైల్వే స్టేషన్- భోరి బందర్ (ముంబై 1853)
- దేశంలో అత్యధిక ష్లాట్ ఫామ్లను కలిగిన రైల్వే స్టేషన్- హౌరా(23 ఫాట్ ఫామ్స్)
- దేశంలోని మొత్తం రైలు మార్గాల పొడవు – 68,103 కిమీ.
- ప్రపంచంలో రైలు మార్గాల పొడవు అధికంగా గల దేశాలు: అమెరికా, చైనా, రష్యా, భారత్
- రైలు మార్గం పొడవులలో చిన్నది: వాటికన్ సిటీ(1.27 కిమీ.), లెసోతో(1.6 కిమీ)
- విద్యుదీకరించిన రైలు మార్గాల పొడవు పరంగా భారత్ రెండో స్థానంలో ఉంది. విద్యుదీకరించిన రైలు మార్గాల పొడవు: 50394 కి.మీ. మొదటిస్థానం – రష్యా
- ఉద్యోగుల పరంగా ప్రపంచంలో భారత రైల్వే మొదటి స్థానంలో ఉంది. ఇండియన్ రైల్వేలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య- 1.3 మిలియన్లు
- మన దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే
- దేశంలో అతిపెద్ద రైల్వే జోన్ ఉత్తర రైల్వే
error: Content is protected !!