ఎలాగైనా సరే.. తన కొడుకు ప్రభుత్వ ఉద్యోగి కావాలనే తండ్రి ఆరాటం అసలుకే ఎసరు తెచ్చింది. ఇప్పుడా ఆ తండ్రీకొడుకులు ఇద్దరూ జైలు పాలయ్యారు. టీఎస్పీఎస్సీ కేసులో తండ్రీ కొడుకులు ఇరుక్కున్నారు. ఇప్పటికే లీకేజీ కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. ఇప్పటివరకు సిట్ ఈ కేసులో ప్రమేయమున్న 17 మందిని అరెస్ట్ చేసింది. తాజాగా మహబూబ్నగర్కు చెందిన తండ్రీ కొడుకులు ఇద్దరినీ అరెస్ట్ చేసింది. దీంతో మొత్తం అరెస్టయిన వారి సంఖ్య 19కి చేరింది.
మహబూబ్ నగర్ చెందిన మైసయ్య, జనార్దన్ లను సిట్ తాజాగా ఈ కేసులో చేర్చింది. మైసయ్య తన కొడుకు కోసం రెండు లక్షల రూపాయలు పెట్టి ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లు సిట్ విచారణలో బయట పడింది. డాక్యాకు రెండు లక్షలు ఇచ్చి మైసయ్య ఈ పేపర్ కొన్నట్లు తేలింది. ఇప్పడు ఈ తండ్రి కొడుకులు ఇద్దరినీ సిట్ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించింది.