ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్), న్యూఢిల్లీ నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఎలిజిబిలిటి టెస్ట్(ఎన్ఓఆర్సెట్)–2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ టెస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎయిమ్స్ల్లో 3803 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్తో పాటు వివిధ రాష్ట్రాల్లోని ఎయిమ్స్లో ఖాళీలున్నాయి. ఈనెల 5న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్ట్ 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎయిమ్స్ పోస్టులు
న్యూఢిల్లీ 597
భువనేశ్వర్ 600
డియోగఢ్ 150
గోరఖ్పూర్ 100
జోధ్పూర్ 176
కళ్యాణి 600
మంగళగిరి 140
నాగ్పూర్ 100
పాట్నా 200
రాయ్బరేలీ 594
రాయ్పూర్ 246
రిషికేష్ 300
అర్హత: బీఎస్సీ(హానర్స్) నర్సింగ్/ బీఎస్సీ(నర్సింగ్)/ బీఎస్సీ(పోస్ట్ సర్టిఫికేట్)/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ (లేదా) డిప్లొమా(జనరల్ నర్సింగ్)తో పాటు రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 2020 ఆగస్ట్ 18 నాటికి 18–30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్సర్వీస్మెన్లకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: మొత్తం 200 మార్కులకు ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దీనిలో మొత్తం 200 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 180 క్వశ్చన్స్ అభ్యర్థి సబ్జెక్ట్ నుంచి మిగతా 20 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ ఆప్టిట్యూడ్ నుంచి వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎగ్జామ్ డ్యురేషన్ 180 నిమిషాలు. జనరల్/ఈడబ్ల్యూఎస్లకు 50%, ఓబీసీలకు 45%, ఎస్సీ/ ఎస్టీలకు 40% క్వాలిఫై పర్సంటేజ్గా నిర్ణయించారు. కేటగిరీల వారిగా మినిమం క్వాలిఫై పర్సంటేజ్ పొందిన అభ్యర్థులకు ఒరిజినల్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది.
ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.1500, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్లకు రూ.1200, పీడబ్ల్యూబీడీలకు ఫీజు లేదు.
ఎగ్జామ్ డేట్: 2020 సెప్టెంబర్ 1
వెబ్సైట్: www.aiimsexams.org