హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా కి చెందిన మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం 2022-2024 విద్యాసంవత్సరానికి ఎంబీఏ కోర్సుల్లో అడ్మిషన్స్కు అప్లికేషన్స్ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఏప్రిల్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు.
స్పెషలైజేషన్లు: కార్పొరేట్ గవర్నెన్స్, ఇన్నవేషన్ అండ్ సస్టైనబిలిటీ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్, ఆపరేషన్స్ అండ్ సిస్టమ్స్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, బిజినెస్ రెగ్యులేషన్స్, కోర్ట్ మేనేజ్మెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ హాజరవుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాట్ 2021/ గ్జాట్ 2022/ జీమ్యాట్ (జూన్ 2020 తర్వాత)/ జీఆర్ఈ (జూన్ 2020 తర్వాత)/ సీమ్యాట్ 2022 స్కోర్ ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: నల్సార్ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎన్-మెట్)/ క్యాట్/ గ్జాట్/ జీమ్యాట్/ జీఆర్ఈ స్కోర్, అకడమిక్ క్రెడెన్షియల్స్, ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఏప్రిల్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎన్మెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మే 1న నిర్వహిస్తారు.
పూర్తి సమాచారం కోసం https://doms.nalsar.ac.in/mba/ వెబ్సైట్ సంప్రదించాలి.