భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ ప్రధానకేంద్రంగా ఉన్న నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 22 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి యూజీసీ నెట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. అలాగే యూజీసీ నెట్ డిసెంబర్ 2022, జూన్ 2021లో అర్హత ఉండాలి. అభ్యర్థుల వయసు 27 ఏళ్లు మించరాదు. నెలకు రూ.50,000లు, ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్: యూజీసీ నెట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థలు ఆన్లైన్లో మార్చి 17వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.500 చెల్లించాలి. పూర్తి వివరాలకు www.nmdc.co.in వెబ్సైట్ సంప్రదించాలి.