కరోనా నేపథ్యం లో రేపటి నీట్ ఎగ్జామ్కు హాజరయ్యే విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అందరి భద్రత,ఆరోగ్య రక్షణ కోసం భౌతిక దూరం పాటిస్తూ ఎన్ టీ ఏ సూచించిన జాగ్రత్తలు అనుసరిస్తూ అభ్యర్థులు ప్రశాంతం గా నీట్ పరీక్షని రాయాలి. సెప్టెంబర్ 13న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా 15.97 లక్షల మంది పరీక్షకు రిజిస్టర్ చేసుకొన్నారు. ఏపీ నుంచి 61,892 మంది, తెలంగాణ నుంచి 55,800 మంది పరీక్షకు అప్లై చేసుకున్నారు.
డ్రెస్ కోడ్;
హాఫ్ హ్యాండ్స్ షర్ట్స్ (పొట్టి చేతుల చొక్కాలు) ధరించాలి.
పెద్ద పెద్ద గుండీలు ఉండరాదు.
షూస్ వేసుకోకూడదు.
స్లిప్పర్స్ వేసుకోవటం బెటర్.
బంగారు అభరణాలు నిషిద్ధం.
విద్యార్థులు మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు వెంట తీసుకెళ్ళాలి.
50 ఎంఎల్ శానిటైజర్, ట్రాన్స్ పరెంట్ వాటర్ బాటిల్ అనుమతిస్తారు.
మొబైల్ ఫోన్, వాచ్, ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలని అనుమతించరు.
అభ్యర్థులేమేం చేయాలి… ఏమేం వెంట తీసుకెళ్లాలో మరోసారి చెక్ చేసుకొండి.
- అభ్యర్థుల హాల్ టికెట్ మూడు పేజీలుంది.దానిలో పాటించవలసిన నియమాలతో పాటు అభ్యర్థులు తమ ఆరోగ్య స్థితిని తెలియచేసే సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం కూడా ఉంటుంది.
- పాస్ పోర్ట్ ఫొటోని దానిపై అంటించి,ఎడమచేతి బొటనవేలి ముద్ర వేసుకొని,తల్లి లేదా తండ్రి సంతకం పెట్టించుకొని ఆ ఫారం ని కచ్చితం గా పరీక్షా కేంద్రానికి తీసుకెళ్ళాలి.
- దీంతో పాటు ఆధార్ కార్డు లేదా పాన్ కార్డ్ వంటి ఏదేని గుర్తింపు కార్డు తీసుకెళ్ళాలి.
- అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లోనికి తమ అడ్మిట్ కార్డు లో ఇచ్చిన టైం లోనే వెళ్ళాలి.
- ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థులని పరీక్షా కేంద్రాలోనికి అనుమతిస్తారు.
- ఎంట్రీ గేట్ వద్దే టెంపరేచర్ చెక్ చేస్తారు.