నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో చేరాలంటే.. వచ్చే 2021-22 విద్యా సంవత్సరానికి సంబందించిన ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునే గడువు ఉంది. ఈ అకడమిక్ ఇయర్లో అయిదో తరగతి చదువుతున్న విద్యార్థులు వచ్చే ఏడాది ఆరో తరగతిలో అడ్మిషన్ పొందాలంటే ఈ ఎలిజిబులిటీ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
◘ పరీక్ష తేది : 30-04-2022
◘ అప్లికేషన్ ఆన్లైన్ లో పంపడానికి చివరి తేదీ : 30-11-2021
◘ అర్హత: 2021-21 విద్యా సంవత్సరంలో గుర్తింపు పొందిన పాఠశాలనుండి ప్రస్తుతము 5 వ తరగతి చదువుతూ ఉండాలి
◘ వయస్సు : విద్యార్థి 01-05-2009 నుండి 30-04-2013 మధ్యలో జన్మించి ఉండాలి.
తెలంగాణలో నవోదయ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే…
కాగజ్నగర్ (ఆదిలాబాద్)
చొప్పదండి (కరీంనగర్)
పాలేరు, భద్రాచలం (ఖమ్మం)
వట్టెం (మహబూబ్నగర్)
వర్గల్ (మెదక్)
చలకుర్తి క్యాంప్ (నల్లగొండ)
నిజాంసాగర్ (నిజామాబాద్)
మామునూరు (వరంగల్)
గచ్చిబౌలి (రంగారెడ్డి)
పూర్తి వివరాలతో పాటు అప్లై చేసేందుకు నవోదయ అఫిషియల్ వెబ్ సైట్ నుంచి ఫారమ్ డౌన్ లోడ్ చేసుకొండి
https://navodaya.gov.in/nvs/en/Home1