HomeLATESTనవోదయ ఎంట్రెన్స్​కు దరఖాస్తు గడువు పొడిగింపు

నవోదయ ఎంట్రెన్స్​కు దరఖాస్తు గడువు పొడిగింపు

దేశవ్యాప్తంగా 653 జవహర్‌ నవోదయ విద్యాలయలో ఆరో తరగతిలో అడ్మిషన్స్​కు సంబంధించి ‘జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2025’ అప్లికేషన్ గడువు పొడిగించినట్లు నవోదయ విద్యాలయ సమితి ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 18న జరుగనుంది. ఫలితాలు మార్చి నెలలో వెల్లడి కానున్నాయి. సెప్టెంబర్ 23వరకు గడువు ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సెప్టెంబర్‌ 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు. విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి. ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది.

WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
WhatsApp Please
SHARE