జాతీయ స్థాయిలో ఉత్తమ టీచర్ అవార్డులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 6వ తేదీనే ఈ గడువు ముగిసింది. తాజాగా ఈ గడువును జులై 15 వరకు పొడిగించింది. నేషనల్ అవార్డ్స్ టు టీచర్స్ 2020 కు దరఖాస్తు చేసిన వారిలో జిల్లా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలోని కమిటీలు షార్ట్ లిస్టు చేసి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తాయి. వీరికి అవార్డులతో పాటు సర్టిఫికెట్లు అందజేస్తారు. ఆసక్తి ఉన్న టీచర్లు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే వీలుంది. https://nationalawardstoteachers. mhrd.gov.in/.
Advertisement