దేశం లోని ఐఐటీలు, బెంగళూరు లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ఎంఎస్సీ, జాయింట్ ఎంఎస్సీ, పీహెచ్డీ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే జామ్ 2021 (జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ) నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత సబ్జెక్టులతో డిగ్రీ పాసైన విద్యార్థులందరూ ఈ పరీక్షకు అర్హులే. గత ఏడాది వరకు మాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయోటెక్నాలజీ, జియాలజి, స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ లకు జామ్ లో అవకాశముండగా.. ఈసారి మొదటిసారిగా ఎకనామిక్స్ విద్యార్థులకు అవకాశం కల్పించారు.
అప్లికేషన్లు; సెప్టెంబర్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 15 వరకు ఆన్ లైన్లో అప్లై చేసుకోవాలి.
ఎగ్జామ్ డేట్; ఫిబ్రవరి 14, 2021 న రెండు షిఫ్ట్ లలో జరుగుతుంది.
ఎగ్జామ్ సెంటర్లు; హైదరాబాద్, వరంగల్, తిరుపతి, విజయవాడ, విశాఖ పట్నం.
రిజల్ట్స్; మార్చి 20, 2021
పూర్తి వివరాలకు వెబ్ సైట్; jam.iisc.ac.in
ఐఐటీల్లో ఎంఎస్సీ అడ్మిషన్లు
Advertisement