మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో ఎస్ఆర్ యూనివర్సిటీ ఈ ఏడాది డీప్ టెక్నాలజీ బీటెక్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది.
టెక్నాలజీ ఫోకస్ తో కంప్యూటర్ సైన్స్, అండ్ ఇంజనీరింగ్ బీటెక్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుది. ఈ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మరియు మెషీన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్, బిగ్ డేటా మరియు డేటా అనలిటిక్స్, క్లౌడ్ ఇంజనీరింగ్ మరియు DevOps ఆటోమేషన్ అంశాలలో స్పెషలైజేషన్ చేసే అవకాశం కూడా ఈ కోర్సు కల్పిస్తోంది.
ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ కంపెనీ భాగస్వామ్యంతో ఈ కొత్త BTech కోర్సును ప్రారంభిస్తున్నట్లు ఎస్ఆర్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ జీఆర్సీ రెడ్డి ప్రకటించారు.
ఇది నాలుగేళ్ల బీటెక్ కోర్సు.
ఇందులో మొత్తం 60 సీట్లున్నాయి.
మ్యాథ్స్ సబ్జెక్ట్ తో ఇంటర్ పాసైన విద్యార్థులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులవుతారు.
కొవిడ్ కారణంగా ఈ ఏడాది ఎంసెట్తో సంబంధం లేకుండా ఇంటర్ మార్కుల ఆధారంగా అడ్మిషన్లు స్వీకరించనుంది.
అడ్మిషన్లు. పూర్తి వివరాలకు https://sru.edu.in/
ఈ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులతోపాటు బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సు కూడా ఉంది.