నిరుద్యోగులకు గుడ్న్యూస్. కరోనా పరిస్థితుల నుంచి సమాజం క్రమంగా బయటపడుతోంది. ఈ క్రమంలో ఇటీవల మందకొడిగా సాగిన ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రస్తుతం వేగవంతమవుతోంది. ప్రముఖ కంపెనీలు సైతం ఉద్యోగ నియామకాలకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో మెగా జాబ్మేళాలు నిర్వహిస్తున్నాయి.
మాసబ్ట్యాంక్లోని మ్యాన్షన్ ఫంక్షన్ హాల్
తాజాగా హైదరాబాద్లో మేగా జాబ్ మేళా జరగనుంది. ఫిబ్రవరి 8 (మంగళవారం) హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్లో ఉన్న ఖాజా మ్యాన్షన్ ఫంక్షన్ హాల్లో ఈ జాబ్ మేళా జరగనుంది. మంగళవారం ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ జాబ్మేళాలో 40 ప్రముఖ కంపెనీలు హాజరుకానున్నాయి.