తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ కి నోటిఫికేషన్ విడుదలయింది. అక్టోబర్ 11 నుండి 18 వరకు విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని కాళోజీ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2022లో అర్హత సాధించిన అభ్యర్థులు నమోదు చేసుకోవాలని తెలిపారు. అక్టోబర్ 11వ తేదీ ఉదయం 10 గంటల నుండి 18వ తేదీ సాయింత్రం 6 గంటల వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.
నిర్ధేశిత ధరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ లో సమర్పించిన దరఖాస్తులు, ధ్రువపత్రాలను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in లో సందర్శించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీలో ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు ఈ నోటిఫికేషన్లో యూనివర్సిటీ వెల్లడించింది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్లను పది శాతానికి పెంచుతూ జీవో నెం.33 జారీ చేసింది.