అరుణ్జైట్లీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్(ఏజేఎన్ఐఎఫ్ఎం)లో ఎంబీఏ ఫైనాన్స్ ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రెండేళ్ల వ్యవధిగల ఈ ప్రోగ్రామ్ ఫుల్టైం రెసిడెన్షియల్గా ఉంటుంది. ఎంబీఏ పూర్తి చేసిన వారికి న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ డిగ్రీ పట్టాను ప్రదానం చేస్తుంది.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ పట్టా, క్యాట్, గ్లాట్, సీమ్యాట్, మ్యాట్, జీమ్యాట్ వ్యాలిడ్ స్కోర్ కలిగి ఉండి అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకుండా ఉండాలి. నేషనల్ ఎంట్రెన్స్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
కోర్సులో భాగంగా మొదటి నాలుగు టర్మ్లు ఉంటాయి.ప్రతి టర్మ్లో 220 సెషన్స్, 16.5 క్రెడిట్స్ ఇస్తారు. 18 నెలలు క్లాస్రూం టీచింగ్, రెండు నెలలు సమ్మర్ ఇంటర్న్షిప్ నిర్వహిస్తారు. చివరి రెండు టర్మ్ల్లో ప్రాజెక్ట్ వర్కులు, డొమెస్టిక్ విజిట్లు, ఇంటర్నేనల్ విజిట్లు ఉంటాయి.
ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసేందుకు ఏప్రిల్ 30 చివరితేది. దరఖాస్తు ఫీజు రూ.2వేలు ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి మే 16 నుంచి 18 వరకు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
వెబ్సైట్ : www.nifm.ac.in