HomeLATESTఎంబీఏ నోటిఫికేషన్​: సెప్టెంబర్​ 5న ఎంట్రన్స్ ​

ఎంబీఏ నోటిఫికేషన్​: సెప్టెంబర్​ 5న ఎంట్రన్స్ ​

ఎంబీఏ, పీజీడీఎం కోర్సులకు ఏఐసీటీఈ నోటిఫికేషన్​ జారీ చేసింది. ఇన్నోవేషన్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్, వెంచర్ డెవలప్​మెంట్ కోర్సులను ఆఫర్​ చేస్తోంది. రెండేళ్ల కాల వ్యవధి ఉండే ఈ కోర్సులకు తాజాగా నోటిఫికేషన్​ వెలువడింది. దేశవ్యాప్తంగా 15 ఇంజనీరింగ్​ కాలేజీల్లోనే ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 450 సీట్లున్నాయి.
ఏఐసీటీఈ కామన్​ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఈ సీట్లను భర్తీ చేస్తుంది. డిగ్రీ లేదా ఇంజనీరింగ్​ పూర్తి చేసిన విద్యార్థులు ఈ ఎంట్రన్స్​కు అర్హులు. ఆగస్ట్​ 28 వరకు అభ్యర్థులు ఆన్​లైన్​లో తమ పేర్లు రిజిస్టర్​ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 5 వ తేదీన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతుంది. ఎంట్రన్స్​ మార్కుల మెరిట్ ఆధారంగా తదుపరి నిర్వహించే ఇంటర్వ్యూ ల ద్వారా అడ్మిషన్లుంటాయి.
దేశంలో కొన్ని కాలేజీలకే పరిమితమైన ఈ కోర్సులు మన రాష్ట్రంలో వరంగల్ లోని ఎస్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఆఫర్​ చేస్తోంది.

సెప్టెంబర్ 10 వ తేదీకల్లా ఫలితాలు విడుదల చేసి అక్టోబర్ 15 వ తేదీలోగా అడ్మిషన్ల ప్రాసెస్​ పూర్తి చేయాలని ఏఐసీటీఈ నిర్ణయించింది.

అప్లై చేసేందుకు చివరి తేదీ; ఆగస్ట్​ 28
ఎంట్రన్స్​ తేదీ; సెప్టెంబర్ 5

అప్లై చేసేందుకు వెబ్​సైట్​; http://cet.cbtexam.in/

పూర్తి వివరాల పీడీఎఫ్​ ఇక్కడ డౌన్​ లోడ్​ చేసుకొండి.

Advertisement
RegistrationGuideline


Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!