ఎంబీఏ, పీజీడీఎం కోర్సులకు ఏఐసీటీఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇన్నోవేషన్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్, వెంచర్ డెవలప్మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. రెండేళ్ల కాల వ్యవధి ఉండే ఈ కోర్సులకు తాజాగా నోటిఫికేషన్ వెలువడింది. దేశవ్యాప్తంగా 15 ఇంజనీరింగ్ కాలేజీల్లోనే ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 450 సీట్లున్నాయి.
ఏఐసీటీఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఈ సీట్లను భర్తీ చేస్తుంది. డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ ఎంట్రన్స్కు అర్హులు. ఆగస్ట్ 28 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 5 వ తేదీన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతుంది. ఎంట్రన్స్ మార్కుల మెరిట్ ఆధారంగా తదుపరి నిర్వహించే ఇంటర్వ్యూ ల ద్వారా అడ్మిషన్లుంటాయి.
దేశంలో కొన్ని కాలేజీలకే పరిమితమైన ఈ కోర్సులు మన రాష్ట్రంలో వరంగల్ లోని ఎస్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఆఫర్ చేస్తోంది.
సెప్టెంబర్ 10 వ తేదీకల్లా ఫలితాలు విడుదల చేసి అక్టోబర్ 15 వ తేదీలోగా అడ్మిషన్ల ప్రాసెస్ పూర్తి చేయాలని ఏఐసీటీఈ నిర్ణయించింది.
అప్లై చేసేందుకు చివరి తేదీ; ఆగస్ట్ 28
ఎంట్రన్స్ తేదీ; సెప్టెంబర్ 5
అప్లై చేసేందుకు వెబ్సైట్; http://cet.cbtexam.in/
పూర్తి వివరాల పీడీఎఫ్ ఇక్కడ డౌన్ లోడ్ చేసుకొండి.