HomeLATESTనవోదయ ఎంట్రెన్స్​​ దరఖాస్తులకు నేడే చివరి తేదీ

నవోదయ ఎంట్రెన్స్​​ దరఖాస్తులకు నేడే చివరి తేదీ

దేశవ్యాప్తంగా 653 జవహర్‌ నవోదయ విద్యాలయలో ఆరో తరగతిలో అడ్మిషన్స్​కు సంబంధించి ‘జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2025’ దరఖాస్తు గడువు సోమవారం (సెప్టెంబర్‌ 23)తో ముగియనుంది. షెడ్యూల్‌ ప్రకారం తొలుత సెప్టెంబర్‌ 16వ తేదీనే దరఖాస్తు ప్రక్రియ ముగిసినప్పటికీ.. పొడిగించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 18న జరుగనుంది. ఫలితాలు మార్చి నెలలో వెల్లడి కానున్నాయి. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్‌ 23లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చేసుకోవచ్చు.

ఎంపికైతే 12వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్​

ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు. విద్యార్థులు 2024–-25 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి. ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు www.navodaya.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here