HomeLATESTనవోదయ ఎంట్రెన్స్​​ దరఖాస్తులకు నేడే చివరి తేదీ

నవోదయ ఎంట్రెన్స్​​ దరఖాస్తులకు నేడే చివరి తేదీ

దేశవ్యాప్తంగా 653 జవహర్‌ నవోదయ విద్యాలయలో ఆరో తరగతిలో అడ్మిషన్స్​కు సంబంధించి ‘జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2025’ దరఖాస్తు గడువు సోమవారం (సెప్టెంబర్‌ 23)తో ముగియనుంది. షెడ్యూల్‌ ప్రకారం తొలుత సెప్టెంబర్‌ 16వ తేదీనే దరఖాస్తు ప్రక్రియ ముగిసినప్పటికీ.. పొడిగించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 18న జరుగనుంది. ఫలితాలు మార్చి నెలలో వెల్లడి కానున్నాయి. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్‌ 23లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చేసుకోవచ్చు.

ఎంపికైతే 12వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్​

ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు. విద్యార్థులు 2024–-25 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి. ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు www.navodaya.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!