హైదరాబాద్లోని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 1553 జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూలు, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష, పోల్ క్లైంబింగ్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సెలెక్షన్లు ఉంటాయి.
అర్హతలు: పదో తరగతితోపాటు ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్/ వైర్మ్యాన్) లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు (ఎలక్ట్రికల్ ట్రేడ్) ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం: నెలకు రూ.24340- రూ.39405
లైన్మెన్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు మార్చి 8 వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 28వ తేదీ వరకు తుది గడువుంది. అభ్యర్థులు అప్లికేషన్తో పాటు 200 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తమ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులుంటే ఏప్రిల్ 1 నుంచి 4వ తేదీ వరకు సవరించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఏప్రిల్ 24 నుంచి అభ్యర్థులకు ఆన్లైన్లోనే డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలుగా హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ 30న ఈ రాత పరీక్ష నిర్వహిస్తారు.
రాత పరీక్ష తెలుగు, ఇంగ్లిష్లో ఉంటుంది. 80 మల్టిపుట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 65 ప్రశ్నలు ఐటీఐ సబ్జెక్టుల నుంచి మిగతా 15 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అడుగుతారు. రాత పరీక్ష సమయం రెండు గంటలు ఉంటుంది. వెయిటేజీ 20 మార్కులు ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలు అప్లికేషన్లకు వెబ్సైట్ డైరెక్ట్ లింక్ tssouthernpower.cgg.gov.in